1945లో ఫాసిజం అనే దుష్టశక్తిని అనేక దేశాలూ, ప్రజలూ ఏకమై ఓడించటం జరిగింది. అందువల్ల ఒక కొత్త యుగం ఆరంభమైంది. కాని యుద్ధానంతర పరిణామంలో తిరిగి ఫాసిజం ప్రతి దేశంలోనూ ఏదో రూపంలో ప్రాణం పోసుకుంటున్నది. అమెరికా పాలకులు దాన్ని తమ దేశంలోనే యథాశక్తి అమలు చేస్తున్నారు. ఇతర దేశాలలో కూడా ఫాసిస్టులకు సహాయపడటానికి తమ దేశ ప్రజల ధన మాన ప్రాణాలను సైతం బలిపెడుతున్నారు. - కొడవటిగంటి కుటుంబరావు


